ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లో జూన్ 16న జరగనున్న యూపీఎస్సీ ప్రిలిమ్స్కు అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల నీట్ పరీక్షల నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ కొత్త నిబంధన విధించింది. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లను బిగిస్తున్నారు. ‘‘నో ఐడీ... నో ఎంట్రీ’’ విధానంలో భాగంగా హాల్టికెట్తోపాటు ఏదైనా గుర్తింపు కార్డు లేని వారిని లోనికి అనుమతించబోరు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి... అధికారులు, పరీక్ష నిర్వాహకులతో జూన్ 13న సమావేశమయ్యారు. ‘‘జూన్ 16న 99 కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. 45,153 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. పరీక్షకు 30 నిమిషాల ముందే గేట్లు మూసివేయాలి. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోం’’ అని ఆయన స్పష్టంచేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.