‣ పరీక్షకు హాజరైన 3,02,172 మంది అభ్యర్థులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు జూన్ 24 సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని సూచించారు. రాష్ట్రంలో 563 పోస్టులతో కూడిన గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 74.86 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్ నికోలస్ ప్రకటించారు. అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 61.78 శాతం నమోదైందని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.