• facebook
  • whatsapp
  • telegram

Education: బీఎస్సీ బయోమెడికల్‌ సైన్స్‌ కోర్సుకు శ్రీకారం

ఈ ఏడాది నుంచే నాలుగేళ్ల ఆనర్స్‌గా అందుబాటులోకి



ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలిసారిగా బీఎస్సీ బయో మెడికల్‌ కోర్సును రాష్ట్ర ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చింది. నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సుగా దీన్ని రూపొందించారు. ఇప్పటివరకు కేవలం ఇంజినీరింగ్‌లో మాత్రమే బయో మెడికల్‌ కోర్సు ఉండేది. ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. పరిశ్రమల నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు కలిసి సిలబస్‌ రూపొందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూన్‌ 7న ఆయన ప్రముఖ లేబొరేటరీస్, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్, మహావీర్‌ ఆసుపత్రి సీనియర్‌ వైద్యులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమై చర్చించారు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఆయా కార్పొరేట్‌ ఆసుపత్రులు, బయో ఫార్మా పరిశ్రమలతోపాటు డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో శిక్షణ పొందేందుకు డిగ్రీ కళాశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. కొన్ని కళాశాలలకు దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దోస్త్‌ పరిధిలో లేని కళాశాలలు సొంతగా ప్రవేశాలు నిర్వహించుకుంటాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.