• facebook
  • whatsapp
  • telegram

TGPSC: గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల

* 13 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధ్రువపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్‌ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు  జూన్ 13 నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకునేందుకు కమిషన్‌ అవకాశం కల్పించింది. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది.

   జాబితా కోసం క్లిక్‌ చేయండి   

పరిశీలన కోసం అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్‌ సూచించింది. కులధ్రువీకరణ, బీసీ నాన్‌ క్రీమీలేయర్, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 2021-22 ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రంతోపాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలని తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుందని.. అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.