* 19 నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్
ఈనాడు, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) రెండో విడతలో 41,533 మందికి డిగ్రీ సీట్లు లభించాయి. రెండో విడత సీట్లను జూన్ 18న కేటాయించినట్లు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. మొత్తం 44,803 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని, తక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల వారిలో 3,270 మందికి సీట్లు దక్కలేదని ఆయన పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు జూన్ 19 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును రిజర్వు చేసుకోవాలి. తొలి విడతలో సీటు పొంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థి...రెండో విడతలో సీటు పొందినా మళ్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని లేకుంటే సీటు కోల్పోతారని లింబాద్రి తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మూడో విడత సవరించిన ప్రవేశాల షెడ్యూల్ను ప్రకటించామని, ఆ ప్రకారం జూన్ 19 నుంచి జులై 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. జులై 6వ తేదీన సీట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. జులై 15 నుంచి మొదటి సెమిస్టర్ తరగతుల బోధన ప్రారంభమవుతుందని తెలిపారు.
తొలి విడత కింద జూన్ 6వ తేదీన 76,290 మందికి సీట్లు దక్కాయి. అందులో 57 వేల మందే ప్రవేశాలు పొందారని లింబాద్రి తెలిపారు. రెండు విడతలు కలిపి 90 వేల మంది వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. 1.60 లక్షల మంది ఇంటర్ సప్లిమెంటరీ రాశారని, వారిలో చాలామేర డిగ్రీలోనే చేరుతారన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లౌడ్ కంప్యూటర్లో ఉద్యోగాల మథనం
‣ డిజిటల్ బిజినెస్ కోర్సులో అడ్మిషన్లు
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్
‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్ అవకాశాలివే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.