* త్వరలో పేపర్-1 పరీక్ష ఫలితాలు
ఈనాడు ప్రతిభ డెస్క్: ఉద్యోగార్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ నియామకాలకు గత మార్చిలో ఎస్ఎస్సీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో 966 పోస్టులు పేర్కొనగా.. అదనంగా 799 ఖాళీలను జత చేస్తూ కమిషన్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో అవసరాల దృష్ట్యా మొత్తం 1,765 జేఈ పోస్టులు భర్తీ కానున్నాయి. జూన్ 5 నుంచి 7 తేదీల్లో జరిగిన పేపర్-1 పరీక్ష ఫలితాలు త్వరలో రానున్నాయి. పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), పేపర్-2 (ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్) రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది.
ఎస్ఎస్సీ జేఈ ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.