ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కన్వీనర్ కోటాలో ప్రభుత్వం కల్పించే ప్రవేశాలకు ఈ ఫీజులు వర్తిసాయి. మోహన్బాబు విశ్వవిద్యాలయంలో బీటెక్, ఎంటెక్కు రూ.1.03 లక్షలు, బీబీఏ, బీసీఏ, బీఎస్సీలకు రూ.44,500 ఫీజును ఖరారుచేసింది. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో బీటెక్కు రూ.60వేలు, ఎంటెక్కు 99,500, బీసీఏకు రూ.37వేలు, బీఎస్సీకి రూ.35,500 ఫీజు నిర్ధారించింది. ఎస్ఆర్ఎం వర్సిటీలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏలకు రూ.1.02లక్షలు, బీఎస్సీ, బీకాం, బీఏ, ఎమ్మెస్సీ కోర్సులకు రూ.44వేల చొప్పున నిర్ణయించింది. అన్నమాచార్య వర్సిటీలో బీటెక్కు రూ.60వేలు, బీఎస్సీ వ్యవసాయానికి రూ.44,500, బీఎస్సీకి రూ.35,500 నిర్ధారించింది. భారతీయ ఇంజినీరింగ్ సైన్సు, టెక్నాలజీ ఇన్నోవేషన్ వర్సిటీ(బెస్ట్)లో బీటెక్కు రూ.69,500, బీసీఏ, బీబీఏలకు రూ.37వేలు, బీఎస్సీ వ్యవసాయానికి రూ.99వేలుగా ఫీజును ఖరారుచేసింది. ఆదిత్య వర్సిటీలో బీటెక్, ఎంసీఏ, ఏంబీఏలకు రూ.60వేలు, ఎంటెక్కు రూ.99,500 చొప్పున నిర్ణయించింది. క్రియా వర్సిటీలో ఎంబీఏ, బీఏ, బీఎస్సీ(నాలుగేళ్లు)కి రూ.97,500, బీబీఏ (ఐదేళ్ల)కు రూ.37వేల ఫీజును ఖరారుచేసింది. విట్లో బీటెక్, ఎంటెక్లకు రూ.1.03లక్షలు, బీబీఏ, బీకాం,
బీఎస్సీ, ఎమ్మెస్సీలకు రూ.44,500 ఫీజును నిర్ధారించింది. అపోలో వర్సిటీలో బీటెక్కు రూ.99,500 ఫీజు ఖరారు చేసింది.
బయట క్యాంపస్లకు అనుమతి..
రాష్ట్రంలో ఐదు ఇంజినీరింగ్ కళాశాలలకు బయట(ఆఫ్) క్యాంపస్లు నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ఏర్పాటుచేయనున్న విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనుమతి ఇచ్చింది. దీంతోపాటు అశోక మహిళా ఇంజినీరింగ్ కళాశాల, పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సైన్సెస్, సాంకేతిక విద్యాపరిషత్ ఇంజినీరింగ్ కళాశాలలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.