• facebook
  • whatsapp
  • telegram

BTech Councelling: బీటెక్‌ కన్వీనర్‌ కోటాకు సగం మందే పోటీ!

ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్‌ స్లాట్‌ బుకింగ్‌
 

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 99,170 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌బుక్‌ చేసుకున్నారు. ఆ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 1,80,424 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 99,170 మంది స్లాట్‌బుక్‌ చేసుకోగా దాదాపు 80 వేల మంది కన్వీనర్‌ కోటా సీట్లపై ఆసక్తి చూపలేదు. ధ్రువపత్రాల పరిశీలనకు శుక్రవారం నాటికి 88,800 మంది హాజరయ్యారు. ఆ ప్రక్రియ జులై 13తో ముగియనుంది. హైదరాబాద్‌లో మాత్రం జులై 14వ తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. జులై 12 నాటికి 60,713 మందే ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన చేయించుకున్న వారిలోనూ కొంత మంది వెబ్‌ ఆప్షన్లు ఇవ్వరు. ఆప్షన్ల నమోదుకు 15 వరకు అవకాశం ఉండటంతో అప్పటికి సుమారు 90 వేల నుంచి 95 వేల మంది వరకు పెరగవచ్చని ప్రవేశాల కన్వీనర్‌ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే 50 నుంచి 52 శాతం మంది మాత్రమే కన్వీనర్‌ కోటాకు పోటీ పడుతున్నారు. కన్వీనర్‌ కోటాలో ఇప్పటివరకు 70,400 వరకు బీటెక్‌ సీట్లున్నాయి.


నేడు సీఎం ఎదుట విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రజంటేషన్‌

 ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యత పెంచే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి జులై 13 మధ్యాహ్నం జేఎన్‌టీయూహెచ్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గత అయిదేళ్ల నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలు, సీట్ల భర్తీ, సీఎస్‌ఈ సీట్లలో పెరుగుదల, కోర్‌ బ్రాంచీల పరిస్థితి, గ్రామీణ జిల్లాలో ఇంజినీరింగ్‌ కళాశాలలు తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. కళాశాలల యాజమాన్యాలు బోధన రుసుముల పెండింగ్‌ తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావించనున్నాయని సమాచారం.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.