* పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రి సబితా సమీక్ష
హైదరాబాద్: ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9, 10వ తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సబిత సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్ తరగతులు కొనసాగుతాయన్నారు. మధ్యాహ్న భోజనానికి పాత స్టాక్ బియ్యాన్ని వాడొద్దని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించామని మంత్రి వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.