* పరీక్షకు తొలిరోజు 83% హాజరు
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు జులై 18న ప్రారంభమయ్యాయి. తొలిరోజు దాదాపు 24 వేల మందికిగాను సుమారు 20 వేల మంది (83 శాతం) హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హాల్టికెట్లలో చిన్నచిన్న తప్పులున్నా అనుమతించాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తుండటంతో గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు.
ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు 7 జిల్లాల అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం తెలుగు మాధ్యమం పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు అన్ని జిల్లాల వారికి పీఈటీ హిందీ, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ మాధ్యమాల్లో పరీక్షలు జరిగాయి. 14 జిల్లాల వారికి పీఈటీ తెలుగు మాధ్యమం పరీక్షలు జరిగాయి. వర్తమాన వ్యవహారాల విభాగం నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలపై, అలానే రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. జాతీయ నూతన విద్యా విధానం, విద్యాహక్కు చట్టం, ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ పోటీలు, అమ్మ ఆదర్శ కమిటీలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతిపై ప్రశ్నలు వచ్చాయని వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి 24న హైదరాబాద్లోని పరీక్షా కేంద్రంలో పరీక్ష ఉంది. అయితే అతను జులై 18న పరీక్ష ఉందని హాల్టికెట్తో ఆ కేంద్రానికి వచ్చాడు. జులై 18న ఆ కేంద్రంలో అసలు పరీక్షే లేదు. దీంతో అధికారులు హాల్టికెట్ను పరిశీలించి, నకిలీదని తేల్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.రెండో రోజు జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) తెలుగు మాధ్యమం పరీక్షలు జరగనున్నాయి.
గుట్టుగా వివరాలు...
తొలిరోజు ఎంతమంది పరీక్ష రాయాల్సి ఉంది? ఏ రోజు ఎంతమంది పరీక్షకు హాజరయ్యారన్న వివరాలను వెల్లడించడానికి విద్యాశాఖ వర్గాలు నిరాకరించాయి. సుమారుగా అని చెబుతున్నారు తప్ప.. కచ్చితమైన వివరాలుచెప్పలేదు.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.