• facebook
  • whatsapp
  • telegram

POSTAL GDS JOB Cutoff Marks: పదిలో ఈ మార్కులుంటే..  పోస్టల్‌ జాబ్‌ గ్యారెంటీ!

* గతేడాది కటాఫ్‌ మార్కుల విశ్లేషణ
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,355, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌తో నియామకాలుంటాయి. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.  ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపిక సమాచారం అందిన రెండు వారాల్లోగా అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డివిజన్‌లలో 2023 జీడీఎస్‌ నియామకాలకు సంబంధించి ఐదో ఎంపిక జాబితా కటాఫ్‌ మార్కులను పరిశీలిస్తే కింది విషయాలు అవగతమవుతాయి. 
 

కేటగిరీ   ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌     తెలంగాణ సర్కిల్‌
  మార్కుల శాతం మార్కుల శాతం
అన్‌రిజర్వ్‌డ్‌    99.3333  93.8333
ఈడబ్ల్యూఎస్‌ 99.3333 95
ఎస్సీ 99 95
ఎస్టీ   95.6667   95
ఓబీసీ  99.1667  95
పీడబ్ల్యూడీ-ఎ 92.5  93.4167
పీడబ్ల్యూడీ-బి 76.8333(4వ జాబితా)  68.4
పీడబ్ల్యూడీ-డీఈ    - 90.25
పీడబ్ల్యూడీ-సి     92.6667   90.25

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.