• facebook
  • whatsapp
  • telegram

ANM: ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం

ఈనాడు, అమరావతి: గిరిజన ప్రాంతాల్లోని 543 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్‌ఎంలను నియమించనున్నట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు.  విద్యార్థుల ఆరోగ్యాన్ని ఏఎన్‌ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారని, నెలకోసారి వైద్యుడు వెళ్లి పరీక్షించి హెల్త్‌ కార్డులు రూపొందిస్తారని ఆమె తెలిపారు. సచివాలయం మూడో బ్లాక్‌లోని ఛాంబర్‌లో మంత్రిగా సంధ్యారాణి జూన్‌ 17న బాధ్యతలు స్వీకరించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం, అంగన్‌వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పౌష్టికాహారం పంపిణీపై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కొత్త వారిని నియమించే వరకు ఆరోగ్య కేంద్రాల్లోని ఏఎన్‌ఎంలను డిప్యుటేషన్‌పై వసతి గృహాలకు పంపిస్తాం. వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత దృష్ట్యా వారిని పిల్లలకు అందుబాటులో ఉంచుతాం. కొత్త ఏఎన్‌ఎంల నియామకాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం’ అని మంత్రి వివరించారు.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.