* గతంతో పోల్చితే కొంత తేలిక
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 16న నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష జరిగింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఈ ఏడాది 1,056 సివిల్ సర్వీసెస్ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 99 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 45,153 మంది అభ్యర్థులకు గాను పేపర్-1 పరీక్షకు 25,875 (57.31 శాతం) మంది, పేపర్-2 పరీక్షకు 25,661 (56.83 శాతం) మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వరంగల్ జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 4,730 మంది అభ్యర్థులకు గాను పేపర్-1 పరీక్షకు 2,637 (55.75 శాతం) మంది, పేపర్-2 పరీక్షకు 2,614 (55.26 శాతం) మంది హాజరయ్యారని హనుమకొండ జిల్లా కలెక్టర్ తెలిపారు. మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా పీజీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. నిబంధనల ప్రకారం తనిఖీ చేసిన తర్వాతనే కలెక్టరును పోలీసులు కేంద్రంలోకి అనుమతించారు. అనంతరం అక్కడి సౌకర్యాల గురించి ఆరా తీసిన కలెక్టర్.. యూపీఎస్సీ నిబంధనల మేరకు గుర్తింపు కార్డులు ఉన్న వారినే పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు.
గతంతో పోల్చితే కొంత తేలిక...
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నలు గతంలోని ప్రశ్నపత్రాలతో పోల్చితే కొంత తేలికగానే ఉన్నాయి. ప్రశ్నల కూర్పులో సమతుల్యత కనిపించింది. వివిధ అంశాల వారీగా ప్రశ్నలు బాగా అడిగారు. అయితే, ఈ ఏడాదికి కటాఫ్ మార్కులు కచ్చితంగా అంచనా వేయకున్నా.. గడిచిన ప్రిలిమ్స్ మార్కుల పరంగా చూస్తే జనరల్ కేటగిరీలో 90 మార్కుల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఫలితాలు జులై 1 తర్వాత వెలువడతాయని అంచనా వేస్తున్నాం
- గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ట్రీ
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.