ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు సివిల్స్-2025 కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని గిరిజన స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్టడీసర్కిల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో జూన్13 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉండాలని, డిగ్రీ పూర్తిచేసి సీశాట్-2025 పరీక్షకు అర్హత సాధించి ఉండాలన్నారు. ఉద్యోగాలు చేస్తున్న, ఇతర కోచింగ్ సంస్థల్లో శిక్షణ పొందుతున్న, ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు అనర్హులని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 62817 66534 ఫోన్ నంబరులో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.