ఈనాడు, హైదరాబాద్: టెట్ రాసిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల్లో 54.38 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-1, పేపర్-2 కలిపి 33,219 మంది పరీక్ష రాయగా.. వారిలో 18,067 మంది కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని గతంలో విద్యాశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో దాదాపు 48 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2010కు ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ అవసరం లేదని హైకోర్టు తీర్పు వెలువరించడంతో పరీక్ష రాసేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. ఎవరు ఏ పేపర్ రాయాలన్న సందిగ్ధత నెలకొనడంతో కొందరు రెండు పేపర్లూ రాశారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.
పురుష ఉపాధ్యాయులదే పైచేయి
ఉత్తీర్ణతలో మహిళా టీచర్ల కంటే పురుష ఉపాధ్యాయులే ముందున్నారు. పేపర్-1కు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న(ఇన్-సర్వీస్) 9,754 మంది దరఖాస్తు చేశారు. వారిలో 6,449 మంది పరీక్ష రాశారు. అందులో 5,113 మంది (79.28%) ఉత్తీర్ణులయ్యారు. 4,969 మంది పురుషుల్లో 2,734 మంది (55%), 4,783 మంది మహిళల్లో 2,377 మంది(49.69%) ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్జెండర్లు ఇద్దరు అర్హత సాధించారు.
పేపర్-2 సాంఘిక శాస్త్రానికి 16,462 మంది టీచర్లు దరఖాస్తు చేయగా.. 11,468 మంది పరీక్ష రాశారు. వారిలో 5,128 మంది(44.71%) ఉత్తీర్ణులయ్యారు. మహిళలు 5,664 మంది పరీక్ష రాయగా.. 1,971 మంది(34.79%) పాసయ్యారు. పురుషులు 5,804 మంది పరీక్ష రాయగా.. 3,157 మంది(54.39%) అర్హత సాధించారు.
పేపర్-2 గణితం-సామాన్య శాస్త్ర విభాగంలో 22,379 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. వారిలో 15,302 మంది పరీక్ష రాశారు. 7,826 మంది(51.14%) ఉత్తీర్ణులయ్యారు. మహిళలు 7,768 మంది పరీక్ష రాయగా.. 3,521 మంది(45.32%) పాసయ్యారు. పురుషులు 7,527 మందికి 4,300 మంది(57.12%) అర్హత సాధించారు. ట్రాన్స్జెండర్లు ఐదుగురు ఉత్తీర్ణులయ్యారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.