‣ సుప్రీంకోర్టు
దిల్లీ: పోటీ పరీక్షల్లో తమ రాష్ట్ర వాసుల్లో కొందరికి అదనపు మార్కులు కలిపేలా హరియాణా ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని రద్దుచేస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును జూన్ 24న సుప్రీంకోర్టు సమర్థించింది. జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ రాజేష్ బిందాల్లతో కూడిన వెకేషన్ బెంచ్.. ఇదో ప్రజాకర్షక విధానంలా ఉందంటూ, దీన్ని రద్దుచేస్తూ ఇచ్చిన హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో సామాజిక-ఆర్థిక నేపథ్యం అర్హతగా కొన్ని వర్గాల అభ్యర్థులకు అదనపు మార్కులు కలపడం రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టు మే 31న తీర్పు ఇచ్చింది. ఒక అభ్యర్థి కష్టపడి చదివి పరీక్షలో 60 మార్కులు తెచ్చుకుంటే, మరో అభ్యర్ధి అదనపు మార్కులతో అతడికి సమానంగా నిలవడాన్ని ఏ విధంగా సమర్థిస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ‘హైకోర్టు తీర్పుని పరిశీలించిన మీదట, మాకు అందులో ఎలాంటి లోపం కనిపించలేదు. ఈ కేసులో నమోదైన స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టేస్తున్నాం’ అని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. గ్రూప్ సి, డి పరీక్షల్లో అదనపు మార్కుల విధానంతో హరియాణా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2022లో కొన్ని ఉద్యోగ నియామకాల్ని చేపట్టింది. వాటిని రద్దుచేసి కొత్తగా మెరిట్ లిస్ట్ తయారుచేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.