వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
‣ రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారు ఎంసెట్కు కూడా హాజరు కావచ్చు. దీని కోసం నిర్దేశించిన బ్రిడ్జికోర్సు పూర్తి చేయాలి.
‣ ఒకవేళ డిగ్రీ చదవాలనుకుంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్, కామర్స్లలో ప్రవేశాలు పొందవచ్చు. బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీలోనూ చేరవచ్చు.
‣ ప్రైవేటు కళాశాలలో వృత్తి విద్యా కోర్సు చేసే ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం బోధనారుసుం కింద రూ.4,500 చెల్లిస్తోంది.
‣ సాధారణ ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు వృత్తి విద్యా కోర్సు చేసేవారికీ ఉపకారవేతనాలు అందుతాయి. 'ప్రతిభ అవార్డులకూ వీళ్లు అర్హులే.
‣ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు. ఇందుకు ఎలాంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా కూడా పాలిటెక్నిక్ చేయవచ్చు. అప్పుడు కూడా రెండో సంవత్సరం నుంచే చదవవచ్చు.
‣ దీర్ఘకాలిక కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం ఏడాది పాటు అప్రెంటిస్షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సమయంలో విద్యార్థికి ప్రతినెలా స్టయిపెండ్ కింద కొంత నగదు లభిస్తుంది (కొన్ని కంపెనీలు మార్కెట్ డిమాండ్ను బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ చెల్లిస్తున్నాయి).
ఎంసెట్/బీఎస్సీ
Posted Date: 20-10-2020