ఇంజినీరింగ్లోనూ...ఐఐటీ మద్రాస్ మేటి!
మనదేశంలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో ఇంజినీరింగ్ ముందుంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకి విశేష ప్రాధాన్యం ఉంది. లక్షల సంఖ్యలో విద్యార్థులు ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ రాస్తున్నారు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు వివిధ బ్రాంచీల్లో కోర్సులు అందిస్తున్నాయి.