• facebook
  • whatsapp
  • telegram

బీస్కూల్స్‌ ప్రవేశానికి మ్యాట్‌

దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలెన్నో మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ) చదువులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (మ్యాట్‌) అందులో ఒకటి. ఈ పరీక్షను ఏడాదికి నాలుగుసార్లు రాసుకోవచ్చు. తాజాగా ఫిబ్రవరిలో నిర్వహించే మ్యాట్‌ ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తైనవారితోపాటు ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా 600కు పైగా సంస్థలు విద్యావకాశం కల్పిస్తున్నాయి.

మ్యాట్‌ పరీక్షను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లో కోరుకున్న విధానంలో రాసుకోవచ్చు. ఆసక్తి ఉంటే రెండు రకాలుగానూ ప్రయత్నించవచ్చు. రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (ఐబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ+ఐబీటీ), కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ), కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ+ఐబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ+సీబీటీ)... వీటిలో నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ), ఆస్కీ, గీతం, చైతన్య, ధృవ, గురునానక్, విజ్ఞాన జ్యోతి, హెచ్‌బీఎస్, అరోరా, ఐఐఆర్‌ఎం, విశ్వవిశ్వానీ, ఐటీఎం, ఐసీబీఎం... సంస్థలు మ్యాట్‌ స్కోర్‌తో ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్షలో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుతుంది. దేశవ్యాప్తంగా 50కు పైగా కేంద్రాల్లో పేపర్‌ బేస్డ్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. 

ఇంటి నుంచే...

కరోనా నేపథ్యంలో రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (ఐబీటీ) విధానంలో ఇంటి నుంచే పరీక్ష రాసుకోవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్‌ కనెక్షన్, వెబ్‌ క్యామ్‌ ఉంటే సరిపోతుంది. ఈ విధానంలో పరీక్షలు ప్రతి రోజూ రెండు స్లాటుల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. నచ్చిన తేదీ, సమయం ఎంచుకునే వెసులుబాటు అభ్యర్థులకు ఉంటుంది. రాయాలనుకున్న తేదీకి కనీసం 3 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.  

పరీక్ష ఇలా

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, మ్యాథమేటికల్‌ స్కిల్స్, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌కు 30, ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌కు 30, మ్యాథ్స్‌ స్కిల్స్‌కు 40, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీకి 35, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌కు 15 నిమిషాల వ్యవధి కేటాయించారు. మాదిరి ప్రశ్నలు, మాక్‌ టెస్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

గమనించండి...

అర్హత: డిగ్రీ పూర్తిచేసినవాళ్లు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: అన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా.

ఫీజు: పేపర్‌ / ఆన్‌లైన్‌ ఏదో ఒక విధానంలో రాయడానికి రూ.1550. రెండు విధాలగానూ రాసుకోవడానికి రూ.2650

పీబీటీ పరీక్ష రిజిస్ట్రేషన్‌ చివరి తేది: ఫిబ్రవరి 28

సీబీటీ పరీక్ష రిజిస్ట్రేషన్‌ చివరి తేది: మార్చి 7

పేపర్‌ ఆధారిత రాతపరీక్ష తేది: మార్చి 6

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: మార్చి 13

ఐబీటీ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 26, 27. మార్చి 5, 12, 13.

తెలుగు రాష్ట్రాల్లో పేపర్, కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://mat.aima.in/feb22/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆట తెలిస్తేనే పోటీలో ముందుకు!

‣ ఉద్యోగ సాధనకు ఇవీ తీర్మానాలు!

‣ 36 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సిద్ధమేనా?

‣ తక్కువ సమయంలో ఉద్యోగం సాధించాలంటే?

Posted Date: 04-01-2022


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌