• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి మార్గం.. మ్యాట్‌

అర్హత: డిగ్రీ 



దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తి చేసుకున్నవారితోపాటు చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కోరుతో సుమారు 600 సంస్థల్లో ఎంబీఏ/ పీజీడీబీఏ కోర్సుల్లో చేరవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. మ్యాట్‌- డిసెంబరు 2023 ప్రకటన వివరాలు..


ఈ పరీక్షను ఏటా నాలుగు సార్లు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లో కోరుకున్న విధానంలో పరీక్ష రాసుకోవచ్చు. ఆసక్తి ఉంటే రెండు విధాలుగానూ రాసుకునే సౌలభ్యం ఉంది. రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (ఐబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ), కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ), డబుల్‌ రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (ఐబీటీ+ఐబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ+ఐబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ+సీబీటీ), డబుల్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ+సీబీటీ) వీటిలో నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. పరీక్షలో సాధించిన స్కోరు ఏడాది వరకు చెల్లుతుంది. దేశవ్యాప్తంగా 50కు పైగా కేంద్రాల్లో పేపర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. 


పరీక్ష ఇలా..

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్‌ స్కిల్స్, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌కు 30, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌కు 30, మ్యాథ్స్‌ స్కిల్స్‌కు 40, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీకి 35, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌కు 15 నిమిషాల వ్యవధి కేటాయించారు. మాదిరి ప్రశ్నలు, మాక్‌ టెస్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 


తెలుగు రాష్ట్రాల్లో.. 

ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజ్‌ (ఐపీఈ), ఆస్కీ, గీతం, విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, ధ్రువ, అరోరా, ఐఐఆర్‌ఎం, విశ్వవిశ్వానీ, ఐటీఎం, ఐసీబీఎం.. సంస్థలు మ్యాట్‌ స్కోర్‌తో ప్రవేశం కల్పిస్తున్నాయి. 


ఇంటి నుంచే..

రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (ఐబీటీ) విధానంలో ఇంటి నుంచే పరీక్ష రాసుకోవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్‌ కనెక్షన్, వెబ్‌ క్యామ్‌ ఉంటే సరిపోతుంది. ప్రతి రోజూ రెండు స్లాటుల్లో ఉదయం, మధ్యాహ్నం వీటిని నిర్వహిస్తారు. నచ్చిన తేదీ, సమయం ఎంచుకునే వెసులుబాటు అభ్యర్థులకు ఉంటుంది. రాయాలనుకున్న తేదీకి కనీసం 4 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. తేదీలు, స్లాట్ల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. 


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా.


పరీక్ష ఫీజు: ఏదైనా విధానంలో ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి రూ.2100. రెండుసార్లు రాయడానికి రూ.3300.   


పీబీటీ పరీక్ష రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: డిసెంబరు 5


పేపర్‌ ఆధారిత రాతపరీక్ష తేదీ: డిసెంబరు 9


తెలుగు రాష్ట్రాల్లో పేపర్‌ బేస్డ్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం


సీబీటీ దరఖాస్తుకు చివరి తేదీ: మొదటి పరీక్షకు నవంబరు 28, రెండో పరీక్షకు డిసెంబరు 11.


సీబీటీ పరీక్ష తేదీలు: డిసెంబరు 3. డిసెంబరు 16.


వెబ్‌సైట్‌: https://mat.aima.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ దివ్యాంగులకు కేంద్రం ఆర్థిక సాయం (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ కొత్త పరిస్థితుల్లో కంగారొద్దు!

‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!

‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

‣ యువత ఉపాధికి దారి.. రియల్‌ ఎస్టేట్‌!

Posted Date: 17-10-2023


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌