• facebook
  • whatsapp
  • telegram

మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు

తామర (రింగ్ వార్మ్స్)     

* 'మైక్రోస్పోరియం ట్రైకోఫైటన్' అనే శిలీంద్రం ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.

* అపరిశుభ్ర పరిసరాలు, వ్యాధి సోకిన రోగి వాడిన వస్తువుల ద్వారా, పిల్లులు, కుక్కల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఈ వ్యాధి వల్ల ఎర్రగా, ఉబ్బెత్తుగా ఉండే పుండ్లు చిన్నవిగా, గుండ్రంగా మొదట శరీరంపై ఏర్పడి క్రమేణా పెద్దవిగా మార్పు చెంది మచ్చలుగా ఏర్పడతాయి.
 

దోబీఇచ్

* అనేక రకాల శిలీంద్రాలు ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తాయి.

* ఈ వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఈ వ్యాధి వల్ల తొడలు, గజ్జలపై దురద, ఎర్రని పొక్కులు ఏర్పడతాయి.

మదురాపాదం

* 'మిరెల్లా మైసిటోమి' అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     

* శరీరంపై ఏదైనా గాయమైనప్పుడు ఈ గాయం ద్వారా ఈ శిలీంద్రం మానవుడిలోకి ప్రవేశిస్తుంది.

* ఈ వ్యాధి పాదాలకు, మడమలకు సోకి లోతైన పుండ్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అంగవైకల్యానికి దారి తీసే పరిస్థితులు కూడా తలెత్తుతాయి.
 

అథ్లెట్ పాదం

* 'ట్రైకోఫైటాన్' అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఈ వ్యాధి ఎక్కువగా తడి ప్రదేశాల్లో సంచరించే వారికి వస్తుంది.

* తడిగా ఉండే చర్మంపై ఈ శిలీంద్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది.

* వ్యాధి సోకిన ప్రాంతంలో మంట పుట్టడం, కాలి వేళ్ల మధ్య పగిలి రక్తస్రావమవడం జరుగుతాయి.

* న్యూరైటిస్ అనే వ్యాధికి 'మ్యూకార్ ఫ్యూజిల్లస్' అనే శిలీంద్రం కారకంగా పనిచేస్తుంది.

* బ్లాస్టోమైకోసిస్ వ్యాధికి 'బ్లాస్టోమైసిస్ డెర్మటైడిస్' అనే శిలీంద్రం కారకమవుతుంది.

* డెర్మటోమైసిస్, మొనిలియాసిస్, కాండీడియాసిస్ వ్యాధులకు 'కాండిడా ఆల్బికాన్స్' అనే శిలీంద్రం కారకమవుతుంది.

* మెనెంజైటిస్ వ్యాధికి 'మైక్రోస్పోరమ్', 'ట్రైకో ఫైటాన్' అనే శిలీంద్రాలు కారణమవుతాయి.

* హిస్టోప్లాస్మోసిస్ వ్యాధికి 'హిస్టోప్లాస్మా కాప్యులేటమ్' అనే శిలీంద్రం కారణం.

* క్రిప్టో కాకోసిస్ వ్యాధికి 'లైఫోమైసిస్ నియోపార్మాన్స్' అనే శిలీంద్రం కారకమవుతుంది.

* ఓటోమైసిస్ అనే వ్యాధికి 'కాండిడా ఆల్బికాన్స్', 'ఆస్పర్జిల్లస్' శిలీంద్ర జాతులు కారణమవుతాయి.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.