• facebook
  • whatsapp
  • telegram

భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు

క్రీస్తు పూర్వం

* 3000-1500

-

సింధునాగరికత కాలం

* 576

-

బుద్ధుడి జననం

* 527

-

మహావీరుడి జననం

* 327-326

-

భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.

* 313

-

జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం.

* 305

-

సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.

* 273 - 232

-

అశోకుడి పాలన

* 145 - 101

-

చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.

* 58

-

విక్రమ శకం ప్రారంభం

క్రీస్తు శకం    

* 78

-

శక యుగం ప్రారంభం

* 120

-

కనిష్కుడి పట్టాభిషేకం

* 320

-

గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)

* 380

-

విక్రమాధిత్యుడి పట్టాభిషేకం

* 405-411

-

ఫాహియాన్ భారత సందర్శన

* 415

-

మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం

* 455

-

స్కందగుప్తుడి పట్టాభిషేకం

* 606-647

-

హర్షవర్థనుడి పాలనా కాలం

* 712

-

మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర

* 836

-

కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం

*985

-

రాజరాజచోళుడి పట్టాభిషేకం

* 998

-

సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం

* 1001

-

భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.

* 1025

-

గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం.

* 1191

-

మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది.
పృథ్విరాజ్ విజయం సాధించాడు.

* 1192

-

తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.

* 1206

-

కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన

* 1210

-

కుతుబుద్దీన్ ఐబక్ మరణం

* 1221

-

భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.

* 1236

-

రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.

* 1240

-

రజియా సుల్తానా మరణం.

* 1246

-

బాల్బన్ పాలన ప్రారంభం

* 1296

-

అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.

* 1316

-

అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.

* 1325

-

మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.

* 1327

-

తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు.

* 1336

-

దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.

* 1351

-

ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.

* 1388

-

ఫిరోజ్ తుగ్లక్ మరణం

* 1398

-

భారత్ పై తైమూర్ దండయాత్రలు

* 1469

-

గురునానక్ జననం

* 1494

-

ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.

* 1497-98

-

భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.

* 1526

-

మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.

* 1527

-

కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు.

* 1530

-

బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.

* 1539

-

హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.

* 1540

-

కనౌజ్ యుద్ధం

* 1555

-

ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు.

* 1556

-

రెండో పానిపట్టు యుద్ధం

* 1557

-

గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ

* 1565

-

తల్లికోట యుద్ధం

* 1576

-

హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.

* 1582

-

దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.

* 1597

-

రాణా ప్రతాప్ మరణం

* 1600

-

ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన

* 1605

-

అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.

* 1611

-

నూర్జహన్ తో జహంగీర్ వివాహం.

* 1616

-

జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.

* 1627

-

శివాజీ జననం. జహంగీర్ మరణం.

* 1628

-

షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.

* 1631

-

ముంతాజ్ మహల్ మరణం.

* 1634

-

భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.

* 1659

-

సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష

* 1665

-

శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.

* 1666

-

షాజహన్ మరణం.

* 1675

-

సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష

* 1680

-

శివాజీ మరణం.

* 1684

-

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.

* 1707

-

ఔరంగజేబు మరణం.

* 1708

-

గురుగోవింద్ సింగ్ మరణం.

* 1780-84

-

రెండో మైసూర్ యుద్ధం.

* 1784

-

పిట్స్ చట్టం.

* 1790-92

-

మూడో మైసూర్ యుద్ధం

* 1793

-

బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్

* 1799

-

నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.

* 1802

-

బేసిన్ ఒప్పందం

* 1809

-

అమృతసర్ ఒప్పందం

* 1828

-

రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.

* 1829

-

సతీసహగమన ఆచారం నిషేధం

* 1830

-

బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన

* 1833

-

రాజారామమోహన్ రాయ్ మరణం.

* 1838

-

కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు

* 1839

-

మహారాజా రంజిత్ సింగ్ మరణం

* 1839-42

-

మొదటి ఆగ్రా యుద్ధం

* 1845-46

-

మొదటి ఆంగ్లో - సిక్ యుద్ధం

* 1852

-

రెండో ఆంగ్లో - బర్మా యుద్ధం

* 1853

-

బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు

* 1857

-

సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం

* 1861

-

రవీంద్రనాథ్ ఠాగూర్ జననం

* 1867

-

బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.

* 1869

-

మహాత్మా గాంధీ జననం

* 1875

-

స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.

* 1876

-

సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.

* 1885

-

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

* 1885- 1905

-

మితవాద యుగం

* 1889

-

జవహర్ లాల్ నెహ్రూ జననం

* 1893

-

చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.

* 1897

-

సుభాస్ చంద్రబోస్ జననం

* 1904

-

టిబెట్ యాత్ర

* 1905

-

లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన

* 1906

-

ముస్లిం లీగ్ స్థాపన

* 1906-1920

-

అతివాద యుగం

* 1909

-

మింటో – మార్లే సంస్కరణలు

* 1911

-

ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.

* 1913

-

గదర్ పార్టీ ఏర్పాటు

* 1914

-

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం

* 1915

-

భారత దేశానికి గాంధీజీ రాక.

* 1916

-

కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.

* 1917

-

చంపారన్ ఉద్యమం

* 1918

-

మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు

* 1919

-

మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం

* 1920

-

ఖిలాఫత్ ఉద్యమం

* 1921

-

ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.

* 1922

-

చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.

* 1922

-

మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.

* 1926

-

భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.

* 1927

-

సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.

* 1928

-

పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం

* 1929

-

మీరట్ కుట్ర కేసు

* 1929

-

లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం

* 1930

-

సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.

* 1931

-

గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.

* 1932

-

మూడో రౌండ్ టేబుల్ సమావేశం.

* 1935

-

భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన

* 1937

-

ప్రొవిన్షియల్ అటానమీ.

* 1939

-

రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.

* 1941

-

రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.

* 1942

-

క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.

* 1942-44

-

ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.

* 1945

-

వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.

* 1946

-

క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.

* 1947

-

అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.

* 1948

-

గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.

* 1949

-

కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)

* 1950

-

గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

* 1951

-

మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.

* 1952

-

లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.

* 1956

-

రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.

* 1957

-

దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి

* 1963

-

పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.

* 1964

-

జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.

* 1965

-

భారత్ పై పాకిస్థాన్ దాడి

* 1966

-

తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.

* 1967

-

నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.

* 1969

-

భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.

* 1970

-

రాష్ట్రంగా మేఘాలయ

* 1971

-

కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.

* 1972

-

సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.

* 1973

-

మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.

* 1974

-

భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.

* 1975

-

ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.

* 1976

-

భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.

* 1977

-

ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం
సంజీవరెడ్డి.

* 1979

-

ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.

* 1980

-

ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.

* 1982

-

మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.

* 1983

-

ఢిల్లీలో చోగమ్ సదస్సు

* 1984

-

పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.

* 1985

-

రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.

* 1986

-

మిజోరాం ఒప్పందం

* 1987

-

రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.

* 1989

-

అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.

* 1990

-

వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.

* 1991

-

జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.

* 1992

-

ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.

* 1993

-

జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.

* 1994

-

పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్

* 1995

-

ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.

* 1996

-

హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.

* 1997

-

భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

* 1998

-

మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.

* 1999

-

డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.

* 2000

-

అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.

* 2001

-

జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.

* 2002

-

అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.

* 2003

-

ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.

* 2004

-

సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.