భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు
డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 - 1963)
* పదవీకాలం 13 మే 1952 నుంచి 12 మే 1957, 13 మే 1957 నుంచి 13 మే 1962.
* భారత తొలి రాష్ట్రపతి.
* అత్యధిక కాలం (2 సార్లు) రాష్ట్రపతిగా పనిచేశారు.
* 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
* రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
* బీహార్ రాష్ట్రానికి చెందినవారు.
* అత్యధిక మెజారిటీ (99.4%)తో ఎన్నికయ్యారు.
* ఈయనపై కె.టి.షా పోటీచేశారు.
* రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి.
* తొలి హిందీ పత్రిక 'దేశ్'కు సంపాదకత్వం వహించారు.
* హిందూ కోడ్ బిల్లు (1951)కు ఆమోదం తెలపకుండా సవరణల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు.
* ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్న రాష్ట్రపతి.
* రెండోసారి రాష్ట్రపతిగా పోటీచేసినప్పుడు నాగేంద్ర నారాయణదాసు (తనపై పోటీ చేసిన అభ్యర్థి) అతి తక్కువ ఓట్లు (2,000) పొందిన వ్యక్తిగా నిలిచారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 - 1975)
* పదవీకాలం 13 మే 1962 - 13 మే 1967.
* మొదటి ఉపరాష్ట్రపతి.
* దౌత్యవేత్త, ఉపాధ్యాయుడు, తత్వవేత్త, దార్శనికుడు.
* రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగక ముందు మద్రాసు రాష్ట్రానికి చెందినవారు.
* రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారయ్యారు.
* ఈయనపై సీహెచ్.హరిరాం పోటీచేశారు.
* రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి.
* టెంపుల్టన్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు.
* యునెస్కోకు ఛైర్మన్గా పనిచేశారు.
* ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఆచార్యులుగా పనిచేశారు.
* ఈయన పుట్టిన రోజైన సెప్టెంబరు 5ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
* చైనా యుద్ధానంతరం రక్షణ మంత్రి కృష్ణమీనన్ను పదవి నుంచి తొలగించమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు.
* మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని (1962లో) విధించారు.
* భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి.
* రాష్ట్రపతుల్లో భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి.
* 1954లో మొదటిసారిగా భారతరత్న అవార్డు పొందిన వారిలో ఈయనొకరు.
డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 - 1969)
* పదవీ కాలం 13 మే 1967 - 3 మే 1969.
* తొలి ముస్లిం రాష్ట్రపతి.
* తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి కూడా ఈయనే.
* ఈయనపై కోకా సుబ్బారావు పోటీ చేశారు.
* పదవీలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి.
* అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు.
* హైదరాబాద్లో జన్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* 1963లో భారతరత్న అవార్డు పొందారు.
వరాహగిరి వెంకటగిరి (1894 - 1980)
* 03 మే 1969 నుంచి 20 జులై 1969 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు.
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి.
* రాష్ట్రపతిగా పోటీచేయాలనే ఉద్దేశంతో తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రెండు పదవులూ ఈయన సమయంలోనే ఖాళీ అయ్యాయి.
* ఇలా రెండు పదవులు ఖాళీ అవ్వడం వల్ల అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 20 జులై 1969 నుంచి 24 ఆగస్టు 1969 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* వి.వి.గిరి రాష్ట్రపతిగా ఎన్నికై 24 ఆగస్టు 1969 నుంచి 24 ఆగస్టు 1974 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* అతి తక్కువ మెజారిటీతో రెండో ప్రాధాన్య ఓటు ద్వారా ఎన్నికయ్యారు.
* ప్రస్తుత ఒడిశాలోని బరంపురానికి చెందినవారు.
* ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండేవారు.
* 'వాయిస్ ఆఫ్ కన్సెషన్' అనే గ్రంథాన్ని రచించారు.
* ఈయన కాలంలోనే బ్యాంకుల జాతీయీకరణ జరిగింది.
* రాజభరణాలు ఈయన హయాంలోనే రద్దయ్యాయి.
* పార్లమెంటు ఆమోదించిన కార్మిక బిల్లుపై తన అభ్యంతరాలను తెలియజేస్తూ వెనక్కి తిప్పి పంపారు.
* ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడిన రాష్ట్రపతి.
* తన ఎన్నిక విషయమై తలెత్తిన వివాదంలో స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై తన వాదనను వినిపించారు.
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 - 1977)
* 24 ఆగస్టు 1974 నుంచి 11 ఫిబ్రవరి 1977 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి పదవిని అలంకరించిన మొదటి వ్యక్తి.
* పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
* ఈయన రెండో ముస్లిం రాష్ట్రపతి.
* అసోంకు చెందినవారు.
* లోక్సభ సభ్యుడిగా ఉంటూ రాష్ట్రపతి పదవికి ఎన్నికవడం ద్వారా లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
* అతి ఎక్కువ ఆర్డినెన్సులను జారీ చేశారు.
* 1975లో ప్రధాని సలహాపై జాతీయ ఆంతరంగిక పరిస్థితిని విధించడం వివాదాస్పదమైంది.
* ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభావంతో అత్యధిక ఆర్డినెన్సులను జారీచేయడం వల్ల రాష్ట్రపతి 'రబ్బరు ముద్ర' అనే పేరు ఈయన హయాంలోనే వచ్చింది.
* ఈయన మరణించడం వల్ల అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బసప్ప దాసప్ప జెట్టి 1977 ఫిబ్రవరి 11 నుంచి 1977 జులై 25 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఈయన 3వ తాత్కాలిక రాష్ట్రపతి.
నీలం సంజీవరెడ్డి (1913 - 1996)
* 1977 జులై 25 నుంచి 1982 జులై 25 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* ఆంధ్రప్రదేశ్కు చెందినవారు.
* ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి.
* మొదటి పర్యాయం వి.వి.గిరిపై పోటీచేసి ఓడిపోయారు.
* అతి చిన్న వయసులోనే (63 సంవత్సరాలు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ, స్పీకర్గానూ పనిచేశారు.
* మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ఈయన హయాంలోనే విధించారు.
* ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
జ్ఞాని జైల్సింగ్ (1916 - 1994)
* 1982 జులై 25 నుంచి 1987 జులై 25 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు.
* పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
* మొదటి సిక్కు రాష్ట్రపతి.
* వెనకబడిన తరగతుల నుంచి వచ్చిన మొదటి రాష్ట్రపతి.
* వివాదాస్పద పోస్టల్ బిల్లు (1986)పై పాకెట్ వీటోను వినియోగించిన రాష్ట్రపతి.
* స్వర్ణ దేవాలయంలో 'ఆపరేషన్ బ్లూ స్టార్' అనే సైనిక చర్య ఈయన కాలంలోనే జరిగింది.
రామస్వామి వెంకట్రామన్ (1910 - 2009)
* 25 జులై 1987 నుంచి 25 జులై 1992 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* ఈయన నలుగురు ప్రధానమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారు 1) రాజీవ్గాంధీ 2) వి.పి.సింగ్ 3) చంద్రశేఖర్ 4) పి.వి.నరసింహారావు.
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ (1918 - 1999)
* 25 జులై 1992 నుంచి 25 జులై 1997 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు.
* ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ చేసిన ఆర్డినెన్స్పై సంతకం చేయడానికి నిరాకరించి వెనక్కి పంపారు.
* వివాదాస్పద దళిత క్రిస్టియన్లకు సంబంధించిన రిజర్వేషన్ ఆర్డినెన్స్ను వెనక్కి పంపారు.
కె.ఆర్.నారాయణన్ (1920 - 2005)
* 25 జులై 1997 నుంచి 25 జులై 2002 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* కేరళ రాష్ట్రానికి చెందినవారు.
* తొలి దళిత రాష్ట్రపతి.
* అత్యధిక మెజారిటీ (9,56,290)తో గెలుపొందిన రాష్ట్రపతి.
* ఓటు హక్కు ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి.
* బీహార్, ఉత్తరప్రదేశ్లలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించమనే కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కి పంపారు.
ఎ.పి.జె.అబ్దుల్ కలాం
* 1931లో జన్మించారు.
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* రాష్ట్రపతి అయిన మొదటి శాస్త్రవేత్త.
* 25 జులై 2002 నుంచి 25 జులై 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు.
* భారత క్షిపణి పితామహుడుగా ప్రసిద్ధులు.
* రాష్ట్రపతిగా పనిచేసిన మూడో ముస్లిం వ్యక్తి.
* ద్వంద్వ పదవుల బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి.
* రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి.
* దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న 2వ రాష్ట్రపతి.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి.
* ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసి పంపించిన ఆర్డినెన్స్ను వెనక్కి పంపారు. కేంద్ర మంత్రివర్గం దీన్ని యథావిధిగా పంపడంతో ఆమోదించారు.
* ఇగ్నైటెడ్ మైండ్స్, విజన్ 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాలను రచించారు.
* యూఎస్కు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ 25 మే 2013న 'వెర్నర్ వాన్ బ్రాన్' అనే అవార్డును ప్రదానం చేసింది.
శ్రీమతి ప్రతిభా దేవీ సింగ్ పాటిల్
* 1934లో జన్మించారు.
* మహారాష్ట్రకు చెందినవారు.
* 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు.
* రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు.
* రాజ్యసభకు డిప్యూటీ చైర్పర్సన్గా పనిచేశారు.
* బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆహ్వానం అందుకున్న తొలి దేశాధినేత.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి.
* టీ-90 యుద్ధట్యాంకులో ప్రయాణించిన రాష్ట్రపతి.
ప్రణబ్ ముఖర్జీ
* 1935, డిసెంబర్ 11న జన్మించారు.
* పశ్చిమ్ బంగకు చెందినవారు.
* 2012, జులై 25 నుంచి రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు.
* కేంద్రంలో ఆర్థిక, విదేశాంగ శాఖలకు మంత్రిగా పనిచేశారు.
* ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
* బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా (2011), పద్మవిభూషణ్ (2008), ఉత్తమ పార్లమెంటేరియన్ (1997) లాంటి అవార్డులు లభించాయి.
* మిడ్ టర్మ్, బియాండ్ సర్వైవల్ ఎమర్జింగ్ డైమెన్షన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఆఫ్ ద ట్రాక్, సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్, ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ అనే పుస్తకాలను రచించారు.
ఉపరాష్ట్రపతులు
ఉపరాష్ట్రపతి | ప్రత్యర్థి | పదవీ కాలం |
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ | - | 1952 - 57 |
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ | 1957 - 62 | |
డాక్టర్ జాకీర్ హుస్సేన్ | ఎన్.సామంత్ సింగ్ | 1962 - 67 |
డాక్టర్ వరాహగిరి వెంకటగిరి | డాక్టర్ హబీబ్ | 1967 - 69 |
గోపాల్ స్వరూప్ పాఠక్ | హెచ్.వి.కామత్ | 1969 - 74 |
బి.డి.జెట్టి | ఎన్.ఇ.హోరో | 1974 - 79 |
ఎం.హిదయతుల్లా | - | 1979 - 84 |
ఆర్.వెంకటరామన్ | బి.సి.కాంబ్లే | 1984 - 87 |
డాక్టర్ శంకర్దయాళ్ శర్మ | - | 1987 - 92 |
కె.ఆర్.నారాయణన్ | కాకా జోగీందర్ సింగ్ | 1992 - 97 |
కృష్ణకాంత్ | సుర్జీత్సింగ్ బర్నాలా | 1992 - 97 |
బి.ఎస్.షెకావత్ | సుశీల్కుమార్ షిండే | 2002 - 2007 |
మహమ్మద్ హమీద్ అన్సారీ | నజ్మాహెప్తుల్లా | 2007 - 2012 |
మహమ్మద్ హమీద్ అన్సారీ | జస్వంత్సింగ్ | 2012 - |
ఉపరాష్ట్రపతులుగా పనిచేసి, తర్వాత రాష్ట్రపతులు అయినవారు ఆరుగురు.
(i) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
(ii) డాక్టర్ జాకీర్ హుస్సేన్
(iii) వి.వి.గిరి
(iv) ఆర్.వెంకట్రామన్
(v) డాక్టర్ శంకర్దయాళ్ శర్మ
(vi) కె.ఆర్.నారాయణన్
మరిన్ని ముఖ్యాంశాలు
* ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ముగ్గురు.
(i) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
(ii) ఎం.హిదయతుల్లా
(iii) డాక్టర్ శంకర్దయాళ్ శర్మ
* రెండుసార్లు ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించినవారు ఇద్దరు.
(i) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
(ii) మహమ్మద్ హమీద్ అన్సారీ.
* ఆంధ్రప్రదేశ్కు గవర్నర్లుగా పనిచేసిన ఉపరాష్ట్రపతులు ఇద్దరు.
(i) శంకర్దయాళ్ శర్మ
(ii) కృష్ణకాంత్
* పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్.
* తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్.
* అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించినవారు వి.వి.గిరి.
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి వి.వి.గిరి.
* పెద్ద వయసులో ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి ఆర్.వెంకట్రామన్.
* మొదటి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్.
* ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా.