• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ప్రధానులు - ప్రత్యేకతలు

జవహర్‌లాల్ నెహ్రూ (1889 - 1964)

*» పదవీ కాలం 15-08-1947 నుంచి 27-05-1964.

*» భారతదేశ మొదటి ప్రధాని.    

*జవహర్‌లాల్ నెహ్రూ

*» ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు. (16 సంవత్సరాల 286 రోజులు).

*» భారత జాతీయ కాంగ్రెస్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

*» పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని.

*» భారతరత్న అవార్డు (1955) పొందిన మొదటి ప్రధాని.

*» ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని.

*» మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు.

*» అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరిగా పేరు పొందారు.

*» పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేశారు.

*» ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.

*» భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి.

గుల్జారీలాల్ నందా (1898 - 1998)

*» పదవీకాలం 27-5-1964 నుంచి 9-6-1964 వరకు.    

గుల్జారీలాల్ నందా

» మొదటి తాత్కాలిక ప్రధాని.

*» లాల్‌బహదూర్ శాస్త్రి మరణాంతరం రెండోసారి 11-1-1966 నుంచి 24-1-1966 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.

లాల్‌బహదూర్‌శాస్త్రి (1904-1966)

*» పదవీకాలం 9-6-1964 నుంచి 11-1-1966 వరకు.    

లాల్‌బహదూర్‌శాస్త్రి
 

*» 1965లో పాకిస్థాన్‌తో మన దేశానికి యుద్ధం జరిగినప్పుడు ప్రధానిగా ఉన్నారు.

*» 1966లో పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

*» పదవిలో ఉండగానే మరణించిన రెండో ప్రధాని.

*» 'జై జవాన్ - జై కిసాన్' అనే నినాదాన్ని ఇచ్చారు.

*» విదేశంలో మరణించిన మొదటి ప్రధాని.

*» మరణాంతరం భారతరత్న (1966) అవార్డు పొందిన మొదటి ప్రధాని.

»* మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా ఈయనే.

*» ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.

»* శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు.

*» 'ఇండియన్ లింకన్'గా పేరుగాంచారు.

*» హరిత విప్లవం కోసం కృషిచేశారు.

* నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఈయన కాలంలోనే ఏర్పాటైంది. ఇది ఆయన చేసిన క్షీర విప్లవ కృషిలో భాగం.

*» ఏ పోర్టుఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు.

*» కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇందిరా గాంధీ (1917-1984)

మొదటిసారి పదవీకాలం 24-1-1966 నుంచి 24-3-1977 వరకు.    
 

ఇందిరా గాంధీ
 

*» రెండోసారి పదవీకాలం 14-1-1980 నుంచి 31-10-1984 వరకు.

*» రెండోసారి చరణ్‌సింగ్ తర్వాత ప్రధానిగా వ్యవహరించారు.

*» మొదటి మహిళా ప్రధాని.     

*» 1971లో 'గరీబీ హఠావో' నినాదాన్నిచ్చారు.     

*» రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి.

*» 1969లో 14 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు.

*» 1980లో మరో 6 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు.

*» రాజభరణాలను 1970లో రద్దు చేయించారు.

*» 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.

*» భారతరత్న అవార్డు (1971) పొందిన తొలి మహిళ.

*» దిల్లీలో జరిగిన నామ్ సదస్సు (1983)కు అధ్యక్షత వహించారు.

*» భారత రాజ్యాంగానికి అత్యధిక సవరణలు (37) ఈమె కాలంలోనే జరిగాయి.

*» అత్యధికసార్లు అత్యవసర పరిస్థితులు ఈమె కాలంలోనే విధించారు.

అరెస్టైన మొదటి ప్రధాని.

» 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాని పదవిలో ఉండి ఓడిపోయారు.

*» మొదటి పోఖ్రాన్ అణు పరీక్షలు (18 మే 1974) 'స్మైలింగ్ బుద్ధ' పేరుతో ఈమె హయాంలోనే జరిగాయి.

*» భారత్‌లో తొలిసారిగా మధ్యంతర ఎన్నికల్ని (1971) నిర్వహించిన ప్రధాని.

*» ఈమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు.

*» 1971లో రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

*» 1972లో చారిత్రాత్మక సిమ్లా ఒప్పందాన్ని అప్పటి పాకిస్థాన్ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్నారు.

*» ఎన్నికల్లో జరిగిన అవకతవకల కారణంగా ప్రధాని పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.

*» 15 ఏళ్ల 303 రోజులు ప్రధానిగా వ్యవహరించారు.

మొరార్జీ దేశాయ్ (1896-1995)

» *పదవీ కాలం 24-03-1977 నుంచి 28-7-1979 వరకు.    
 

మొరార్జీ దేశాయ్

*» మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి.

*» ఆర్థికమంత్రిగా ఎక్కువ పర్యాయాలు (8 సార్లు) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

*» పెద్ద వయసులో (81 ఏళ్లు) ప్రధానిగా వ్యవహరించారు.

*» 1991లో భారతరత్న అవార్డు అందుకున్నారు.

*» 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును ఈయన కాలంలోనే తొలగించారు.

*» ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి.

*» మండల కమిషన్‌ను ఏర్పాటుచేశారు.

*» నిరంతర ప్రణాళికలు ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు.

*» దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

*» ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానమంత్రుల్ని (చరణ్‌సింగ్, జగజ్జీవన్‌రాం)ఈయన కాలంలో నియమించారు.

*» జన్మస్థలం గుజరాత్.

*» పాకిస్థాన్ పురస్కారం 'నిషాన్-ఇ-పాకిస్థాన్' పొందిన తొలి భారతీయుడు.

చరణ్‌సింగ్ (1902-1987)

*» పదవీ కాలం 28-7-1979 నుంచి 14-1-1980 వరకు.    

చరణ్‌సింగ్

*» రైతు బాంధవుడుగా పేరుగాంచారు.

*» పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని.

*» లోక్‌దళ్ పార్టీ వ్యవస్థాపకుడు.

*» పార్లమెంటులో మొదటిసారిగా విశ్వాసతీర్మానం ప్రకటనను ఈయన కాలంలోనే జారీ చేశారు.

*» ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.

*» ప్రధానమంత్రిగా 23 రోజులు పనిచేయగా ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు.

రాజీవ్ గాంధీ (1944-1991)

*» జన్మస్థలం ముంబయి.    

రాజీవ్ గాంధీ
 

*» పదవీకాలం 31-10-1984 నుంచి 01-12-1989 వరకు.

*» అతి చిన్న వయసులో (42) ప్రధాని అయ్యారు.

*» ఓటు హక్కు వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.

*» పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు.

*» కేంద్ర మంత్రిమండలిని అత్యధికంగా (13 సార్లు) పునర్ వ్యవస్థీకరించారు.

*» సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు.

*» నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు.

*» జవహర్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు.

*» 'బికారీ హఠావో' నినాదాన్ని ఇచ్చారు.

*» IPKF (Indian Peace Keeping Force) దళాలను శ్రీలంకకు పంపారు.

*» ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పరచారు.

*» బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలొచ్చాయి.

*» ఈయన మే 21, 1991న హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఏటా మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినంగా భారత ప్రభుత్వం పాటిస్తోంది.

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (1931-2008)

*» జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.    

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
 

*» పదవీకాలం 2-12-1989 నుంచి 10-11-1990 వరకు.

*» మండల కమిషన్ సిఫార్సుల్ని అమలు చేశారు.

*» విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయారు.

*» దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టారు.

*» అంతర్‌రాష్ట్ర మండలిని తొలిసారిగా ఏర్పాటు చేశారు.

*» అయోధ్య వివాదంలో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు.

చంద్రశేఖర్ (1927-2007)

*» పదవీ కాలం 10-11-1990 నుంచి 21-6-1991 వరకు.    

చంద్రశేఖర్
 

*» జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.

*» ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని.

*» ఈయన కాలంలోనే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.

*» భారత్ రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి.

*» ఈయన్ని 'యంగ్ టర్క్' అంటారు.

*» 'బోన్సీ బాబా'గా పేరొందారు.

*» 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు అనుమతినిచ్చి వివాదాస్పదుడయ్యారు.

*» పార్లమెంటులో కోరం సభ్యుల మద్ధతు లేకుండానే జనతాదళ్‌ను చీల్చి కాంగ్రెస్ మద్ధతుతో ప్రధానిగా వ్యవహరించారు.

పాములపర్తి వెంకట నరసింహారావు (1921-2004)
 

*» జన్మస్థలం తెలంగాణ.    

పాములపర్తి వెంకట నరసింహారావు

*» పదవీకాలం 21-6-1991 నుంచి 16-5-1996 వరకు.

*» దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి.

*» పూర్తి పదవీకాలం మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించిన ఏకైక ప్రధాని.

*» దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్‌సింగ్‌తో కలిసి పునాదులు వేశారు.
*» పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే ప్రధాని అయిన తొలి వ్యక్తి. తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు.

*» 'లుక్ ఈస్ట్' అనే పాలసీని సూత్రీకరించిన ప్రధాని.

బహు భాషా పండితుడు.

*» ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా (1971-73) పని చేశారు.

*» 'దేశ్ బచావో, దేశ్ బనావో' నినాదాన్ని ఇచ్చారు.

*» ఈయన ఆత్మకథ పేరు "The Insider".

అటల్ బిహారీ వాజ్‌పేయీ (1926)

*» జన్మస్థలం మధ్యప్రదేశ్.    

అటల్ బిహారీ వాజ్‌పేయి

*» మొదటిసారి పదవీకాలం 16-5-1996 నుంచి 01-6-1996 వరకు.

*» రెండోసారి 19-3-1998 నుంచి 22-5-2004 వరకు.

*» మొదటిసారి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా కొనసాగారు.

*» ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని.

*» కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు.

*» పోఖ్రాన్‌లో రెండోసారి అణుపరీక్షలు 'ఆపరేషన్ శక్తి' పేరుతో 11 మే, 1998న నిర్వహించారు.

*» లాహోర్ బస్సు రాయబారం ఈయన కాలంలోనే ప్రారంభమైంది.

*» అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందాలకు శ్రీకారం చుట్టారు.

*» 'జై విజ్ఞాన్' అనే నినాదాన్ని ఇచ్చారు.

హెచ్.డి. దేవెగౌడ (1933)

*» జన్మస్థలం కర్ణాటక.    

హెచ్.డి. దేవెగౌడ

*» పదవీ కాలం 01-6-1996 నుంచి 20-4-1997 వరకు.

*» దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన రెండో వ్యక్తి.

*» కేంద్ర క్యాబినెట్ మంత్రి అవ్వకుండానే ప్రధానిగా వ్యవహరించారు.

*» రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని పదవిని నిర్వహించిన రెండో వ్యక్తి.

*» పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా ప్రధాని అయిన రెండో వ్యక్తి.

*» 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

*» అతి తక్కువ మంది లోక్‌సభ సభ్యుల్ని (44) కలిగియుండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఐ.కె. గుజ్రాల్ (1919-2012)

*» జన్మస్థలం పాకిస్థాన్‌లోని జీలం.    

ఐ.కె. గుజ్రాల్

*» పదవీకాలం 21-4-1997 నుంచి 19-3-1998 వరకు.

*» రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రధాని పదవిని చేపట్టిన మూడో వ్యక్తి.

*» వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు.

*» జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి (14 పార్టీలు) నేతృత్వం వహించారు.

*» గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ (1932)
 

*» పాకిస్థాన్‌లోని జీలంలోని 'ఘా' అనే గ్రామంలో జన్మించారు.    

డాక్టర్ మన్మోహన్ సింగ్

*» మొదటిసారి పదవీకాలం 22-5-2004 నుంచి 25-5-2009 వరకు.

*» రెండోసారి పదవీకాలం 25-5-2009 నుంచి 26-5-2014 వరకు.

*» రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధాని అయ్యారు.

*» ప్రధాని పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త.

*» విశ్వాసతీర్మానంపై ఓటు వేయలేని మొదటి ప్రధాని.

*» కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

*» యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA) కూటమి ద్వారా ప్రధాని అయ్యారు.

*» అమెరికాతో 123 అణు ఒప్పందాల్ని కుదుర్చుకున్న ప్రధాని.

*» దేశంలో సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్నవారిలో 3వ స్థానంలో ఉన్నారు.

*» లోక్‌సభ పదవీకాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాని.

*» 2010లో వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డు పొందారు.

*» వరుసగా 5వ సారి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

*» వరుసగా 10సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు.

నరేంద్ర మోదీ (1950)

*» 26 మే 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు.    

నరేంద్ర మోదీ
 

*» గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

*» 'స్వచ్ఛభారత్' నినాదాన్ని ఇచ్చారు.

*» 'జనధన్ యోజన'ను ప్రారంభించారు.

*» వారణాసి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు.

ప్రధానమంత్రుల సమాధుల పేర్లు

ప్ర‌ధానమంత్రి     సమాధి పేరు
జవహర్‌లాల్ నెహ్రూ     శాంతివన్
గుల్జారీలాల్ నందా    నారాయణ్‌ఘాట్
లాల్ బహదూర్ శాస్త్రి     విజయ్ ఘాట్
ఇందిరా గాంధీ     శక్తి స్థల్
మొరార్జీ దేశాయ్    అభయ్ ఘాట్
చరణ్‌సింగ్     కిసాన్ ఘాట్
రాజీవ్ గాంధీ     వీర్ భూమి
చంద్రశేఖర్     స్మృతి స్థల్
పి.వి. నరసింహారావు    జ్ఞాన భూమి

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.